Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the td-cloud-library domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/nginx/domains/andhrawatch.com/public/wp-includes/functions.php on line 6121
విభజన హామీలన్నీ అమలు చేసేశాం అంటున్న కేంద్రం - Andhrawatch.com

విభజన హామీలన్నీ అమలు చేసేశాం అంటున్న కేంద్రం

Sunday, April 20, 2025

విభజన హామీల గురించి ఏపీ ప్రభుత్వం గట్టిగా అడగలేక పోవడంతో అన్ని ఎప్పుడో దాదాపుగా అమలు చేసేశాం అని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్పేందుకు వెనుకాడటం లేదు. విభజన చట్టంలోని కీలక హామీల గురించి పట్టించుకోని కేంద్రం కేవలం ప్రతి రాష్ట్రంలో నెలకొల్పుతున్న విధంగా నెలకొల్పిన కొన్ని కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటునే విభజన హామీల అమలుగా చూపే ప్రయత్నం చేస్తున్నది.

ఆంధ్రప్రేదశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపర్చిన హామీలన్నీ దాదాపుగా అమలు చేశామని, మరికొన్ని హామీలు వివిధ దశల్లో అమలవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం తెలుగుదేశం ఎంపీ కే. రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ విషయం వెల్లడించారు. 

అయితే, విభజన చట్టంలో పొందుపరిచిన కీలకమైన మేజర్ పోర్టు ఏర్పాటు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర ప్రభుత్వం మరోసారి చేతులు ఎత్తేసింది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాంశాలను వారిద్దరూ పరస్పర చర్చలతో తేల్చుకోవాలి గాని తమకేమి సంబంధం లేదన్నట్లు చేతులు దులుపుకొంది.

విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ – సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవనాల నిర్మాణం కోసం 2022లో రూ. 106.89 కోట్లు మంజూరు చేయగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 కోట్లను విడుదల కూడా చేసినట్టు వెల్లడించారు. అయితే ఎప్పటికి ఇది పూర్వతుతుందో మాత్రం పెదవి విప్పనే లేదు.

దుగరాజపట్నంలో మేజర్ పోర్టు ఏర్పాటు సాధ్యం కాలేదని, సమీప ప్రాంతంలో ఉన్న పోర్టుల నుంచి గట్టి పోటీ ఉండడం వల్లనే సాధ్యపడలేదని తేల్చి చెప్పారు. దుగ్గరాజుపట్నం బదులుగా రామాయపట్నం వద్ద మేజర్ పోర్టు అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, అయితే నాన్-మేజర్ పోర్టుగా నోటిఫై అయినందున డీ-నోటిఫై చేయాలంటూ సూచించామని చెప్పారు. లేదంటే మరో ప్రాంతాన్ని గుర్తించి సూచించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. 

మరోవైపు కడపలో సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని ‘స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సమగ్ర అధ్యయనం అనంతరం స్పష్టం చేసిందని, అయినప్పటికీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం రోడ్ మ్యాప్ రూపకల్పన చేయాలంటూ కేంద్ర ఉక్కు శాఖ జాయింట్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిందని కేంద్ర మంత్రి సమాధానంలో పేర్కొన్నారు.

విభజన చట్టంలోని పొందుపరిచిన హామీల్లో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (ఐఐటి), గిరిజన విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) సహా అనేక విద్యాసంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. 

పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం సహా ఇప్పటి వరకు రూ. 21,154.568 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. అదెప్పటికీ పూర్తవుతుందో, సవరించిన అంచనాలను ఎప్పటికి ఆమోదిస్తారా, పునరావాస కార్యక్రమాల గతి ఏమిటో ప్రస్తావించనే లేదు. అదే విధంగా రాజధాని విషయంలో ప్రతిపాదిత కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ఎందుకు ఆపేశారో చెప్పే ప్రయత్నం చేయలేదు.

రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు పరిష్కారం కోసం కేంద్ర హో శాఖ సమీక్షలు, సమావేశాలు జరపడే గాని పరిష్కారం కుదిరేవిధంగా కేంద్రం తీసుకున్న చర్యలు ఏవీ చెప్పలేక పోతున్నారు.   పెండింగ్ అంశాలను రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతోనే ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోందని చెప్పడం ద్వారా తమకేమి సంబంధం లేదన్నట్లు తేల్చి చెప్పారు.  వివాదాలున్న సమస్యలకు ఆమోదయోగ పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తుందని వెల్లడించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles