రాజమౌళి-మహేష్‌ సినిమా గురించి కీరవాణి అప్డేట్‌!

Monday, September 16, 2024

దర్శకధీరుడు రాజమౌళి- సూపర్‌ స్టార్ మహేశ్‌ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్‌ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా #SSMB 29 గా రాబోతున్న సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మూవీ నుంచి తాజా అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ పాటికే సినిమాను లాంచ్ చేయాల్సి ఉంది. కానీ ఏమైందో తెలీదు ఈ ప్రాజెక్ట్ గురించి చిత్ర బృందం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ లేదు. మహేష్ మాత్రం జక్కన్న తన లుక్ మొత్తాన్ని మార్చుకొని, జిమ్ లో భారీ కసరత్తులు చేస్తూ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

ఇలాంటి తరుణంలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కీరవాణి తాజా ఇంటర్వ్యూల్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కీరవాణి SSMB29 ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..”మహేశ్ (– రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయిపోయింది. నేను ఇంకా మ్యూజిక్ వర్క్ మొదలుపెట్టలేదు. కొన్ని టెస్ట్ షూట్స్ చేస్తున్నారు. జులై లేదా ఆగస్టులో నా పని మొదలుపెడతాను” అంటూ వివరించారు.

ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు టెస్ట్ షూట్ చేస్తున్నారంటే షూటింగ్ మొదలయ్యేసరికి ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది కూడా అవ్వొచ్చు. ఇక సినిమా అంతా పూర్తవ్వడానికి నాలుగేళ్ళయినా పట్టొచ్చేమో. కనీసం ఆగస్టులో మహేష్ బర్త్ డే కైనా ఈ మూవీ అప్డేట్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles