అందుకే వచ్చిన కంపెనీలన్ని పక్కరాష్ట్రాలకు పారిపోయాయి!

Sunday, January 11, 2026

ఏపీలో గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పై విజయ నగరం జిల్లా నెలిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రతి డిపార్ట్‌ మెంట్‌ ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆమె మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్పా చేసిన అభివృద్ది శూన్యం అని ఆమె మండిపడ్డారు.

రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని చూసి రాష్ట్రానికి వచ్చిన కంపెనీలన్ని కూడా పక్క రాష్ట్రానికి పారిపోయాయని ఆమె ఎద్దేవా చేశారు.
 ఆసరా పెన్షన్ ల విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం చాలా అవినీతి చేసిందని ఆమె ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలి అంటే కూటమితోనే సాధ్యమని ప్రజలు నమ్మారని.. అందుకే ఎన్నికల్లో ఘన విజయం అందించారని తెలిపారు. టీడీపీ, జనసేన అధినేతలు ఇద్దరు సంపద సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. పది సంవత్సరాలపాటు ఈ కూటమి కలిసి నడుస్తుందని.. అప్పుడే ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ గా ఉంటుందని ఆమె కామెంట్స్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles