శ్రీరెడ్డి.. పర్వర్టెడ్ కారు కూతలు!

Tuesday, July 2, 2024

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విసిరే కుక్క బిస్కెట్లకు ఆశపడి అదే పనిగా మొరుగుతూ చెలరేగిపోయిన అనేకమంది కూలీలలో శ్రీ రెడ్డి కూడా ఒకరు.

తెలుగులో పోర్న్ స్టార్ అనదగిన హోదాను తన స్వయంశక్తితో, స్వయం ప్రతిభతో సంపాదించుకున్న నటీమణి శ్రీ రెడ్డి. కేవలం పోర్న్ హోదాతో సెలబ్రిటీ స్టేటస్ కోరుకున్న మహిళ ఆమె. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయురాలు. ఆ పార్టీ నాయకులు అనేక మందికి సన్నిహితురాలు. జగన్మోహన్ రెడ్డి పట్ల తన కుల భక్తినే చాటుకున్నదో, లేదా ఇతరత్రా ఉన్న అనుబంధాన్ని చాటుకున్నదో తెలియదు గాని నిత్యం ఆయనను పొగడడంతోనే తన సోషల్ మీడియా వేదికలను నింపేస్తూ తరిస్తూ ఉంటుంది.
నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో మొరుగుతూ ఉండిన కుక్కలన్నీ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. కానీ కొందరికి మాత్రం ఇంకా ఆ మత్తు దిగలేదు. అలాంటివారు అనేకమంది ఉన్నారు.

తెలుగు పత్రికారంగా చరిత్రను దశదిశలను మార్చివేసిన ఈనాడు అధినేత రామోజీరావు మరణిస్తే ఆయన శత్రువులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. సానుభూతి వ్యక్తం చేశారు. అయితే శ్రీరెడ్డి మాత్రం ఇంకా వైసీపీ వారి హ్యాంగోవర్ లోంచి బయటకు వచ్చినట్లుగా లేదు. ఆమె సోషల్ మీడియా వేదికల్లో కూసిన కారుకూతలు, చూసిన వారికి కంపరం పుట్టిస్తున్నాయి.

‘‘జగనన్న ఓటమిలో సింహభాగం ఉన్న రామోజీరావు సచ్చాడంట. అందరూ రిప్ కొట్టి సంతోషం వెళ్లగకండి’’ అంటూ శ్రీ రెడ్డి పెట్టిన పోస్టు అసహ్యంగా ఉంది. ‘‘బోణీ కొట్టాం లెగ్గు బాబు.. లెగ్గు మామూలు లెగ్గు కాదు..’’ అంటూ రామోజీ మరణంతో కూడా చంద్రబాబు నాయుడు ను బదనాం చేయడానికి శ్రీరెడ్డి పడుతున్న పాట్లు చూస్తే.. అన్న కాని అన్న జగనన్న కళ్ళలో ఆనందం కోసం ఆమె పరితపించిపోతున్నట్లు అర్థమవుతోంది.

నిజానికి మీడియా చెప్పినంత మాత్రాన ప్రజలందరూ గంపగుత్తగా ఓట్లు వేసేస్తారని అనుకోవడం భ్రమ. ప్రజలలో కేవలం ఒక ఆలోచన వస్తుంది అంతే! ఆ మాటకొస్తే ఈనాడు కంటే ఎక్కువ సంఖ్యలో పత్రికలు ముద్రించి పంచి పెడుతూ వచ్చిన సాక్షి జగన్మోహన్ రెడ్డిని ఎంత భజన చేసినా సరే.. ఎన్ని జాకీలు పెట్టి లేపినా సరే.. ఆ పార్టీకి 11 కి మించి సీట్లు సాధించలేకపోయింది. ప్రజలలో జగన్ పరిపాలన పట్ల అసహ్యం పుట్టిందనే వాస్తవాన్ని గుర్తించకుండా శ్రీరెడ్డి లాంటి పర్వర్టెడ్ మనుషులు ఆ ఓ ఓటమిని రామోజీరావుకి ముడి పెట్టడానికి ప్రయత్నం చేస్తే వారికి భవిష్యత్తు కూడా ఉండదు. ప్రజలు తమను అసహ్యించుకున్నారనే వాస్తవాన్ని గుర్తిస్తే మాత్రమే కనీసం మరికొన్నాళ్లపాటు రాజకీయాల్లో ఉండగలుగుతారు. ఆ వాస్తవాన్ని అందరూ తెలుసుకోవాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles