కొత్త బిజినెస్ మొదలు పెట్టిన రకుల్‌!

Monday, September 16, 2024

టాలీవుడ్ ముద్దుగుమ్మ , స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకుని వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.

కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఫిబ్రవరి 21 న ఈకో-ఫ్రెండ్లీ పద్ధతిలో గోవాలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

 తనుకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా  సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా తాను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. హైదరాబాద్‌లో ‘ఆరంభం’ పేరుతో త్వరలో రెస్టారెంట్ స్టార్ట్ చెయ్యనుంది. ఇందులో మిల్లెట్స్‌తో తయారు చేసిన ఫుడ్ లభించనుంది. అయితే.. ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles