నాగ్‌ అశ్విన్‌ పోస్ట్ చూశారా..!

Thursday, December 4, 2025

టాలీవుడ్‌లో వచ్చిన భారీ విజయం సాధించిన సినిమాల్లో కల్కి 2898 ఏడి ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విశేష హైప్ క్రియేట్ చేసింది. కొత్త కాన్సెప్ట్, అద్భుతమైన ప్రెజెంటేషన్‌తో ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంది.

ఈ విజయానికి కొనసాగింపుగా రెండో భాగం కూడా ఉంటుందని మేకర్స్ ముందే ప్రకటించారు. మొదటి పార్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో కనిపించింది. కానీ సీక్వెల్‌లో ఆమె లేనట్టే అని తాజా సమాచారం బయటకు వచ్చింది. దీనిపై అభిమానుల్లో చర్చలు ఎక్కువవుతున్నాయి.

ఇక తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మరింత ఆసక్తి రేపుతోంది. గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తు మన నిర్ణయాలతోనే రూపుదిద్దుకుంటుందని ఆయన రాసిన స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ పోస్ట్ నిజంగా దీపికా సినిమా నుంచి తప్పుకోవడానికే సంబంధించిందా అని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles