విడాకులు తీసుకోబోతున్న బాలీవుడ్ స్టార్‌ కపుల్‌!

Sunday, May 19, 2024

గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం ..అభిప్రాయ భేదాలు రావడంతో ఆ బంధానికి స్వస్తి చెప్పడం సర్వసాధారణంగా మారిపోయింది. కొంతకాలం క్రితం వరకు అయితే వారికి విడాకులు వచ్చి వారంతంట వారే ప్రకటించే వరకు ఈ విషయం ఎవరికీ తెలిసేది కాదు..

కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ  ముందుగా వారు విడిపోతున్నారనే విషయం సోషల్ మీడియాలో వచ్చే  పోస్టుల ద్వారానే అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది. తాజాగా ఇప్పుడు ఓ బాలీవుడ్  స్టార్‌ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది.

ఆ స్టార్‌ జంట ఇంకెవరో కాదు రణవీర్ సింగ్ – దీపికా పడుకొనే. ఈ ఇద్దరు 2018 లో ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే 2018లో వీరి  వివాహం ఘనంగా జరిగింది.  గతేడాది దీపిక ఓ షోలో చేసిన కామెంట్లు వీరిద్దరూ విడాకులు తీసుకునే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.

అయితే ఆ తర్వాత ఆ విషయం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.  తాజాగా మరోసారి వీరి డివోర్స్‌  వ్యవహారం తెర మీదకు వచ్చింది. దానికి కారణం ఏంటంటే..సోషల్‌ మీడియాలో  దీపికతో జరిగిన వివాహనికి సంబంధించిన ఫోటోలను రణవీర్ తీసేయేడమే. ఆయన ఎందుకు ఫోటోలను డిలీట్ చేశారు? ఏంటి? అనే విషయం గురించి మాత్రం ఇప్పటి వరకు ఓ క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియా నుంచి దీపికతో వివాహానికి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడంతో వీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం మరోసారి తెరమీదకు వచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles