రజినీతో సినిమాలో నటించి తప్పు చేశా..స్టార్‌ హీరోయిన్‌ సంచలన కామెంట్స్‌!

Saturday, April 12, 2025

టాలీవుడ్‌ నటీమణుల్లో మమత మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరియర్ బిగినింగ్‌లోనే స్టార్ హీరోల సరసన ఆడిపాడి  మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్‌గా సాగుతుండగానే అనుకోకుండా క్యాన్సర్ బారిన పడి కోలుకుంది.  ఆ తర్వాత టాలీవుడ్ ను వదిలి కేవలం తమిళ, మలయాళ చిత్రాల్లో యాక్ట్‌ చేస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా విశాల్‌తో ‘శిలపతికారం అనే సినిమాలో, విజయ్ సేతుపతితో మహారాజా సినిమాలో నటించింది మమతా. అయితే మహారాజా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్లొన్న ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్ సినిమా కుసేలన్ పై హాట్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. కుసేలన్‌ మూవీలో ఓ పాట కోసం రజనీతో ఒప్పందం చేసుకుని 2 రోజుల పాటు షూటింగ్‌కి వెళ్లి  ఎంతో కష్టపడి ఆ పాటను చేసాను.

అయితే ఆ సినిమాలో నేను చేసిన భాగం అంతా కూడా డిలీట్ అయింది. కేవలం ఆ పాటలో ఒక్క సెకను మాత్రమే నేను కనిపిస్తానని.. అది చూసిన నాకు అసలు కుసేలన్ సినిమాలో ఎందుకు నటించానో అని అనిపించిందని సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాపై మమతా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్‌ గా మారాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles