జాంబీ—ఈసారి అంతర్జాతీయ స్థాయిలో…!

Friday, December 5, 2025

తెలుగులో జాంబీ జానర్‌కి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన సినిమా ‘జాంబీ రెడ్డి’. కరోనా సమయంలో విడుదలైన ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంతో, వినోదం కలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో చూపించిన కొత్త కాన్సెప్ట్, సటైరికల్ ప్రెజెంటేషన్ అప్పట్లో మంచి చర్చనీయాంశమైంది.

ఇప్పుడు ఈ హిట్ మూవీకి కొనసాగింపుగా రెండో భాగం రాబోతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ మళ్లీ హీరో తేజ సజ్జాతో కలసి ఈ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికారికంగా సీక్వెల్‌ని అనౌన్స్ చేశారు కాబట్టి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ముఖ్యంగా తేజ సజ్జా ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా క్రేజ్ సంపాదించుకున్నందున, ఈ సారి సినిమా స్థాయి కూడా భారీగా పెంచాలని మేకర్స్‌ ఆలోచన. జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్‌ను డిజైన్ చేస్తున్నారు. సరదా, వినోదం తగ్గకుండా ఉండేలా స్క్రీన్‌ప్లే తయారవుతుందని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles