ఓజీ కోసం రంగంలోకి ఓజీ ప్రొడ్యూసర్‌!

Friday, December 5, 2025

టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. పవన్ కొత్త స్టైల్లో కనిపించబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమా విడుదలైన రోజు వచ్చే కలెక్షన్లు చూసి మాత్రమే ఈ హైప్ ఎంత స్థాయిలో ఉందో అర్థం కానుంది.

ఇక వ్యాపార పరంగా కూడా ఓజి ఇప్పటికే పెద్ద చర్చకు కారణమైంది. దేశవ్యాప్తంగా మంచి రేట్లకు అమ్ముడైపోతున్న ఈ సినిమాలో, నైజాం రీజియన్ హక్కుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాంత హక్కులను భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అంటే నైజాం మార్కెట్ లో ఆయన ఆధ్వర్యంలోనే ఈ భారీ సినిమా విడుదల కాబోతోందని స్పష్టమవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles