‘ఈ నగరం’లోకి ‘డాకు’ ..!

Friday, December 5, 2025

టాలీవుడ్‌లో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సినిమాల్లో ఒకటైన “ఈ నగరానికి ఏమైంది”కి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి భాగం ఎంత నవ్వులు పూయించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ ఫన్‌కి కొనసాగింపుగా “ఈఎన్ఈ రిపీట్” అనే టైటిల్‌తో రెండో పార్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై పాజిటివ్ బజ్ మొదలైంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం, ఈ సినిమాకు బోనస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా నందమూరి బాలకృష్ణ గారు ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారన్న వార్త వినిపిస్తోంది. ఇది కేవలం చిన్న క్యామియో పాత్రే అయినా, విశ్వక్ సేన్‌తో కలిసి వచ్చే కొన్ని నిమిషాల సన్నివేశాలు సినిమా హైలైట్‌గా నిలవనున్నాయంటూ చెప్పుకుంటున్నారు.

ఇది వాస్తవం అయితే మాత్రం బాలయ్య ఎంట్రీ వల్ల థియేటర్లలో ఎనర్జీ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా, యువతను ఆకట్టుకునేలా దర్శకుడు ఈ సీన్‌ను డిజైన్ చేశారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతూ, ఈ సీక్వెల్ మీద అంచనాలు ఇంకా పెంచేస్తోంది.

ఇంతకీ బాలయ్య ఈ ప్రాజెక్ట్‌లో వాస్తవంగా ఉన్నారా లేదా అనేది తెలియాలంటే చిత్రబృందం నుండి క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. కానీ ఒకవేళ నిజమే అయితే మాత్రం ఈ సీన్ థియేటర్‌లో పండగలా మారే అవకాశమే ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles