మరోసారి ఆ డైరెక్టర్‌ కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన ధనుష్‌!

Friday, December 5, 2025

టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న తాజా చిత్రం కుబేర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో కనిపించారు. కథ, కథనాలు, తీసిన విధానం అన్నీ కలిపి ప్రేక్షకుల్లో మంచి స్పందనను రాబట్టాయి.

ఇక ఈ సినిమాలో ధనుష్ పెర్ఫార్మెన్స్‌కి ప్రత్యేకంగా ప్రస్తుతించాల్సిందే. ఆయన పాత్రలో ఉండే ఇన్నర్ ఇమోషన్స్‌ని బాగా చూపించగలిగాడు. ఆడియెన్స్ ఎంతగానో కనెక్ట్ అవ్వడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతూ హిట్‌గా నిలవడంతో ధనుష్ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. గతంలో వచ్చిన ‘సార్’ తర్వాత ఇది తెలుగులో ఆయనకు మరో హిట్ కావడం ఫ్యాన్స్‌కి సంతోషాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకుల మధ్య ఆయన క్రేజ్ మరో స్థాయికి చేరినట్టే కనిపిస్తోంది.

ఇప్పుడు కుబేర విజయంతో ధనుష్ తదుపరి తెలుగు ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. అందులోనూ ఆయన మళ్లీ ‘సార్’ దర్శకుడు వెంకీ అట్లూరితో పనిచేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, 2027లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం.

ఇద్దరూ గతంలో కలిసి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు కాబట్టి మళ్లీ ఈ కాంబినేషన్‌కు మంచి బజ్ క్రియేట్ అయింది. కుబేర సక్సెస్ తర్వాత ధనుష్ వంతు ఇప్పుడు వెంకీ అట్లూరితో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయడమేనా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles