గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ అనే టైటిల్తో భారీ అంచనాలు తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ గ్లింప్స్కి భారీ స్పందన రావడంతో ఈ సినిమా పై ఆసక్తి రెట్టింపైంది.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే మరింత హైప్ పెంచుతోంది. ప్రస్తుతంగా సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, ఇందులో కొన్ని ఇంటెన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. అందులో ముఖ్యంగా రామ్ చరణ్ పై ఒక సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ ఎపిసోడ్ పూర్తిగా ట్రైన్ బ్యాక్డ్రాప్లో ఉంటుందట. భారీగా రూపొందిస్తున్న ఈ సన్నివేశం సినిమా హైలైట్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ ట్రైన్ ఎపిసోడ్లో రామ్ చరణ్ యాక్షన్ను బిగ్ స్క్రీన్ మీద చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలోని ఈ విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్స్ ప్రేక్షకులకు ఒక రేంజ్లో ట్రీట్ ఇచ్చేలా ఉండనున్నాయట.
ఇక ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించడమే మరో స్పెషల్ అట్రాక్షన్. వృద్ధి సినిమాస్ ఈ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొత్తం మీద ‘పెద్ది’ సినిమా ఒక్కో అప్డేట్తో అభిమానులలో అంచనాలను పెంచేస్తోంది.
