ఓజీ పై ఇంట్రెస్టింగ్‌ సమాచారం!

Friday, December 5, 2025

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న “ఓజి” అనే భారీ చిత్రం గురించి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తుండగా, కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. చాలా రోజులుగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి వార్తలు వస్తున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా పూర్తిగా పూర్తవ్వలేదు.

తాజాగా పవన్ నుండి తిరిగి డేట్స్ వచ్చాయి, దీంతో మళ్లీ షూటింగ్ మొదలైంది. అయితే ఈసారి సెట్స్‌పై ఓ కొత్త మార్పు కనిపించినట్టు సమాచారం. చిత్రానికి మొదట పని చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ స్థానంలో ఇప్పుడు మనోజ్ పరమహంసను తీసుకున్నారు. సినిమాటోగ్రఫీలో బిగ్ నేమ్ అయిన మనోజ్ గతంలో ఎన్నో విజువల్‌గా అద్భుతమైన సినిమాలకు పని చేశారు.

ఇంతకుముందు పవన్ సినిమాల్లో టెక్నికల్ టీం మారిన సందర్భాలు ఉన్నా, ఈసారి “ఓజి”లో ఈ మార్పు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. మనోజ్ స్టైల్‌కి ఓజి స్టోరీకి ఎంత వర్కౌట్ అవుతుందో చూడాలి. మరి కొత్త సినిమాటోగ్రఫీ కంటెంట్‌తో “ఓజి” ఎలా కనిపిస్తుందో తెలియాలంటే కొద్దిసేపు వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles