ఇడ్లీ కొట్టు పెట్టబోతున్న ధనుష్‌!

Wednesday, October 16, 2024

టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ఏ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పేరుకు కేరళ కుట్టి అయినప్పటికీ ఈ బ్యూటీ డ్రెస్సింగ్ స్టైల్, మాటతీరు.. తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటివరకు తను గ్లామర్ షో చేయలేదు. అలా మొదలైంది, ఉరుమి, వయోలిన్, వెప్పం‘వెల్లతూవల్, కేరళ కేఫ్ , ఏంజెల్ జాన్, అపూర్వరాగం, అన్వర్, , ఐదోండ్ల అయిదు, మకరమంజు, S/O సత్యమూర్తి, ఒక్క అమ్మాయి తప్ప, గీత గోవిందం, భీమ్లా నాయక్’ఇష్క్, తలసమయం ఓరు పెంకుట్టి, బ్యాచిలర్ పార్టీ, జబర్దస్త్ , గుండెజారి గల్లంతయ్యిందే, బెంగళూరు డేస్, రుద్రమదేవి, కాంచన 2,  వంటి తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి మరెన్నో మంచి మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరై ఇంట్లో ఆడపిల్లలా కలిసిపోయింది.

ఆమె సినీ కెరీర్ తొలినాళ్ల నుంచి ఆమెకు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది..  2022లో జవహర్ డైరెక్షన్‌ వహించిన ‘తిరిచిరంబళం’ చిత్రంలో ధనుష్ సరసన నటించింది. ఇందులో ఆమె పాత్ర శోభన మరింత ట్రెండింగ్‌గా మారింది. ఈ చిత్రానికి గానూ నిత్యా మీనన్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా తీసుకుంది. అలాగే ఇందులోని ‘మేగం కారుకథ’ పాటకు కూడా కొరియోగ్రఫీ జాతీయ అవార్డు వచ్చింది. ఈ సందర్భంలో ధనుష్‌కి జోడీగా నిత్యా మీనన్ నటిస్తుందని టాక్‌.

ఈ చిత్రానికి కూడా ధనుష్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ధనుష్‌తో కలిసి నిత్యా మీనన్ మరోసారి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles