జిగ్రా కోసం రంగంలోకి ముగ్గురు స్టార్స్‌!

Tuesday, October 8, 2024

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ నటించిన తాజా సినిమా ‘జిగ్రా’ దసరా కానుకగా నేషన్‌వైడ్ విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సినిమాతో ఆలియా మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతుందని అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాలో ఆలియా చేసే యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ అంటుంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రమోషన్స్‌కి చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో అక్టోబర్ 8న పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించారు. కాగా, ఈ ఈవెంట్‌కి ముగ్గురు స్టార్ సెలెబ్రిటీలు గెస్టులుగా వచ్చారు.

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి, స్టార్ బ్యూటీ సమంత, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యారు. దీంతో ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles