ముగ్గురు దర్శకులతో తారక్‌ మాస్‌ ఫ్రేమ్‌!

Thursday, September 19, 2024

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్నమోస్ట్‌ అవైటెడ్ భారీ సినిమా “దేవర” గురించి అందరికీ తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబోలో చేస్తున్న రెండో భారీ సినిమా ఇది కాగా దీనిపై సెన్సేషనల్ హైప్ అయితే ఇప్పటికే వచ్చేసింది.

ఇక ఈ చిత్రం తర్వాత తారక్ మరిన్ని భారీ ప్రాజెక్ట్ లు చేస్తుండగా ఈ ప్రాజెక్ట్స్ లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే తన బాలీవుడ్ డెబ్యూ మూవీ “వార్ 2” దర్శకుడు అయాన్ ముఖర్జీతో కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ముగ్గురుతో కలిసి తారక్ కనిపించిన ఒక మాస్ ఫ్రేమ్ ప్రస్తుతం కేజ్రీగా మారింది.

దీంతో తారక్ నుంచి రానున్న రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసే ఫ్రేమ్ ఇది అంటూ అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ క్రేజీ కలయిక ఎందుకు అంటే ఈ ముగ్గురు దర్శకులతో కలిసి తారక్ ఓ ఇంటర్వ్యూలో కనిపించబోతున్నాడు అని అందుకే వీరు కలిసినట్టుగా సమాచారం.

అయితే దీని గురించి ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దేవర ఓ పక్క యూఎస్ మార్కెట్ లో ఆల్ టైం రికార్డు బుకింగ్స్ ని నమోదు చేస్తుండగా ఈ సెప్టెంబర్ 27 పాన్ ఇండియా భాషల్లో సినిమా విడుదల కాబోతుంది. అలాగే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలను అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్‌కి హృతిక్ రోషన్‌తో వార్ 2 సినిమా కూడా ఉంది.  ఇది ఇండియన్ సినిమాస్ లో నెక్స్ట్ పెద్ద సినిమా అవుతుందని సమాచారం. వార్ 2 విడుదలకు ముందే, ఎన్టీఆర్ దేవరతో పాన్-ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇది తారక్ టీం చేస్తున్న ఒక మంచి ప్లానింగ్ అని సమాచారం. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles