తన జాతీయ అవార్డుని వారికి అంకితం ఇచ్చేసిన నటుడు!

Thursday, September 19, 2024

శుక్రవారం కేంద్ర ప్రభుత్వం  జాతీయ అవార్డులు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇందులో ఉత్తమ నటుడుగా కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కి గాను “కాంతార” సినిమాకి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ అవార్డుకు తను తగినవాడే అంటూ అంతా ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ అవార్డు గెలిచిన తర్వాత రిషబ్ ఒక ఎమోషనల్ నోట్ ని విడుదల చేశాడు.

తాను జాతీయ అవార్డు గెలవడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను అని అలాగే తనతో ఈ ప్రయాణంలో భాగం అయిన వారందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పుకొచ్చారు. అలాగే తనకి వచ్చిన ఈ అవార్డును తన రాష్ట్రంలో దేవ నర్తకులకి అలాగే దివంగత హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారికి అంకితం చేస్తున్నాను అని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు తన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles