చిరు-పవన్‌-చరణ్‌ మల్టీస్టారర్‌ మూవీ!

Wednesday, September 18, 2024

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్ట్ 15 న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఆగస్ట్ 14న స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

హరీష్ శంకర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మెగా అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తే ఒక విషయాన్ని వెల్లడించారు. నేను పవన్ కళ్యాణ్ గారు, చరణ్ గారు, చిరంజీవి గారు, ముగ్గురికి సంబందించిన లైన్ ఎప్పటి నుండో రెడీ చేసుకున్న, అది చేస్తే అన్ని పాన్ ఇండియా మూవీస్ కన్నా, చాలా పెద్ద మూవీ అవుతుంది అంటూ హారీశ్‌ మెగా అభిమానులను ఊరించారు.

 పుష్ప,  కాంతారా లు ముందు పాన్ ఇండియన్ సినిమాలు అనుకోలేదు. కానీ ఆ సినిమాలను అందరూ అంతా యాక్సెప్ట్ చేశారు అంటూ తెలిపారు. మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల సందర్భంగా చేస్తున్న ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles