‘రాజమౌళి అభిమానులకు ఓ సర్ ప్రైజింగ్ వార్త?

Friday, October 18, 2024

మరో కొద్ది రోజుల్లో మహేష్ బాబు’ పుట్టిన రోజు రాబోతుంది. ఈ సందర్భంగా  ఆగస్టు 9న రాజమౌళి – మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతోందని ఇప్పటికే చాలా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ రోజున ఈ మూవీ కాన్సెప్ట్ వీడియోని విడుదల చేస్తారని బాగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం గోల ఎలా ఉన్నా.. ఇప్పుడు మరో వార్త రాజమౌళి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్  ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

ఇంతకీ, ఆ వార్త ఏమిటో తెలుసా ?, ఈ పాన్ వరల్డ్ సినిమాను రాజమౌళి మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నారని.. మొదటి భాగంలో మహేష్ హీరో కాగా, మిగిలిన భాగాల్లో మరో ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తారని ఈ వార్త  అసలు విషయం. గ్రాఫిక్స్ కు అధిక ప్రాధాన్యం ఉన్నందున రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారట.

మరి ఇది నిజమో.. కాదో.. వేచి చూడాలి. ఇక తాను ఈ సినిమా మ్యూజిక్‌ వర్క్‌ ను ఆగస్టులో స్టార్ట్‌ చేస్తా’ అని ఎం.ఎం. కీరవాణి ఇప్పటికే ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల ఎంపిక విషయంలో రాజమౌళి ఇప్పటికే టెస్ట్‌ షూట్స్‌ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఈ సినిమా ఈ సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే మహేశ్ వర్క్ షాప్‌కు హాజరవుతుండగా.. అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్స్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles