ఏపీలో 20 లక్షల దొంగ ఓట్లను గుర్తించిన టీడీపీ శ్రేణులు

Thursday, September 19, 2024

ఆంధ్ర ప్రదేశ్ లో వ్యూహాత్మకంగా ఓటర్ల జాబితాలో దొంగ ఓటర్ల పేర్లను చేర్పిస్తున్న వైసిపి ఎత్తుగడలకు అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దొంగల ఓటర్లను గుర్తించే పక్రియ చెప్పారు. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని పార్టీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిపారు.

 వీటిపై చర్యలు కోరుతూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా వివరాలను ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని చంద్రబాబు జరిపిన సమీక్ష సమావేశంలో వివరించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై నిరంతర పోరాడాలని చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపు అంశాలను సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఓటమి భయంతో వైసీపీ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతుందని, దాని కోసం ఇప్పటి నుంచే కుట్రలు మొదలు పెట్టిందని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎలక్షన్ కమిటీ సభ్యులతో ఈ సందర్భంగా తీసుకోవలసిన చర్యల గురించి చంద్రబాబు నాయుడు చర్చించారు.

పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ఓటర్ల వెరిఫికేషన్ కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలను కూడా ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా వైసీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని చంద్రబాబు తెలిపారు. అనర్హులకు ఓట్ల విషయంలో ఉద్దేశ్య పూర్వకంగా తప్పులు చేసే ఏ అధికారినీ వదిలేది లేదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అక్రమాలకు సహకరించే అధికారులను గుర్తించాలని పార్టీ నేతలకు సూచించారు.

నియోజకవర్గాల వారీగా ఓటర్ జాబితాలో ఉన్న అనర్హుల ఓట్ల లిస్ట్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఇచ్చామని నేతలు పార్టీ అధినేతకు వివరించారు. వైసీపీ దొంగ ఓట్ల అక్రమాలకు పాల్పడుతోందని, అక్రమాలకు పాల్పడుతూ ఆ బురదను తిరిగి టీడీపీకి అంటించే ప్రయత్నాలను గట్టిగా ఎండగట్టాలని చంద్రబాబు సూచించారు.

చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయడం, టీడీపీకి అనుకూలం అని భావించే వారి ఓట్లను తొలగించడం, ఒక బూత్ లో ఓట్లను మరో బూత్ కు బదలాయించడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles