పోలవరం ముంపుపై తెలుగు రాష్ట్రాల మధ్య ప్రచ్ఛన్న పోరు!

Monday, September 16, 2024

పోలవరం ముంపు సమస్యపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రచ్ఛన్న పోరు ఉధృతం అవుతున్నది. పోలవరం బ్యాక్ వాటర్ తో తెలంగాణకు ముప్పు సమస్య ఏర్పడుతున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం ఆందోళన చెందుతుంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కొట్టిపారవేస్తున్నది. మరోవంక, కేంద్రం సహితం తెలంగాణ ప్రభుత్వం గోడును పట్టించుకోవడం లేదు.

అందుకనే, సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ విషయమై ఏపీని నిలదీసేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ సిద్ధమైంది. జులైలో పోలవరం ముంపుతో భద్రాచలంలో తీవ్ర నష్టం సంభవించినా ఇప్పటికీ ఎందుకు నివారణ చర్యలు పేపట్టడం లేదని ఏప్రిల్ 10న జరగనున్న సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసేందుకు తెలంగాణ ఆధారాలతో నివేదికలను రూపొందిస్తున్నది.

పోలవరంతో తెలంగాణలో ముంపు సంభవించలేదని ఏపీ చేస్తున్న వాదనలను ఎండగట్టేందుకు పటిష్టమైన ప్రణాళికలను రాష్ట్ర నీటిపారుదల శాఖ సిద్ధం చేస్తుంది. పోలంవరం బ్యాక్‌ వాటర్‌తో అనేక ప్రాంతాలు తీవ్ర నష్టపోయినట్లు వీడియో ఆధారాలున్నప్పటికీ, జాతీయ స్థాయిలో చర్చ జరిగినప్పటికీ తప్పించుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను ఈ సమావేశంలో ఎండగట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ముంపు ప్రాంతాలను దేశంలోని ప్రజలందరూ మీడియా ద్వారా చూసినప్పటికీ పోలవరంతో తెలంగాణలో ముంపు జరగలేదని ఏపీ వాదించడం పట్ల తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ నిపుణులు సమావేశమై సీడబ్ల్యూసీ సమావేశంలో వీడియో క్లిప్పింగ్స్‌ ప్రదర్శించి ఏపీ నిజస్వరూపాన్ని దేశప్రజలకు చూపించాలనే పట్టుదలతో నివేదికలను రూపొందిస్తోంది.

ముంపునకు మరో అధ్యయనం అవసరం లేదని కేంద్ర జల సంఘం ఓరా చెప్పడాన్ని కూడా తెలంగాణ తప్పుబట్టింది. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో పోలవరం అథారిటీతో కలిసి పోలవరం ముంపుబాధిత రాష్ట్రాలు ఒడిశా, చత్తీస్‌గఢ్‌, తెలంగాణతో ఉమ్మడి సర్వే నిర్వహించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది.

జులైలో కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం, ముర్రేడు, కిన్నరసాని వాగులు పోటెత్తి మరో ఆరు స్ల్యూయిస్‌కు సంబంధించి బ్యాక్‌ వాటర్‌ ప్రమాద ఘంటికలు మోగించింది. పలు గ్రామాలు నీటమునిగాయి… వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేల ఎకరాల పంట భూములు నీటమునిగాయి. వరద ప్రవాహానికి సాగుభూమిలో ఇసుక తెప్పలు తేలాయి.

అయితే భారీ వరదలను తట్టుకునే స్థాయిలో పోలవరం లేకపోవడంతోనే బ్యాక్‌ వాటర్‌ ప్రమాదం ఏర్పడిందని తెలంగాణ వాదిస్తున్నది.  పోలవరం ముంపుతో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు డిమాండ్‌ చేయడంతో విధిలేని పరిస్థితిలో పోలవరం ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని కేంద్ర జలసంఘం ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 10న సీడబ్ల్యూసీ పోలవరం అథారిటీ, ఆంధ్ర, తెలంగాణ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తెలంగాణకు జరిగిన నష్టాలపై పవర్‌ ఫాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించేందుకు తెలంగాణ సిద్ధమైంది.

ఈ సమావేశంలో తెలంగాణ ప్రధానంగా పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవల్‌లో నీటిని నిల్వచేసినప్పుడు ఏర్పడుతున్న ముంపును గుర్తించాలనీ, అదేవిధంగా డ్రైనేజ్‌ స్థానిక ప్రవాహాలు నిలిచిపోవడంతో ఏర్పడే నష్టాలను అధ్యయంనం చేయాలి, మణుగూరు భారజల కేంద్రం, చరిత్రాక భద్రాచలం ఆలయానికి రక్షణకు చర్యలు చేపట్టాలి, కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఈ సమావేశంలో తెలంగాణ డిమాండ్‌ చేయనుంది.

జాయింట్‌ సర్వే నిర్వహించి పుణలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నిపుణులతో అధ్యయనం చేయించాలని సమావేశంలో తెలంగాణ సూచించనుంది. ముంపు ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణాలు, నష్టపరిహారం చెెల్లించాలని తెలంగాణ పట్టుబట్టనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles