తెలంగాణ సీఎంకి..ఏపీ డిప్యూటీ సీఎం కోటి చెక్‌ అందజేత!

Wednesday, September 18, 2024

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాత్కాలికంగా తన సినిమాలకి విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సమయాన్ని అంతటిని కూడా ఆయన పూర్తి రాజకీయాల్లోనే పెట్టినట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులంతా కూడా ఆయన సినిమాలు ఎప్పుడు మొదలవుతాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వరదలు ముంచెత్తాయి. దీంతో పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా చెరో కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రికి తన 1 కోటి చెక్ ని అందజేశారు. ఈ క్రమంలోనే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి కోటి రూపాయల చెక్ ని అందజేశారు. దానికి సంబంధించిన పిక్స్ ఇపుడు వైరల్ గా మారాయి. మరి ఇందులో పవన్, రేవంత్ సహా ఇతర ముఖ్యులు కూడా కనిపిస్తున్నారు. ఇక పవన్ చేయనున్న “హరిహర వీరమల్లు”, “ఓజి” సినిమాలు ఈ సెప్టెంబర్ నుంచే మొదలు కాబోతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles