మరోసారి జత కడుతున్న నితిన్‌..రాశిఖన్నా!

Thursday, September 19, 2024

టాలీవుడ్ హీరో నితిన్ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబిన్‌హుడ్‌  లో హీరోయిన్‌ రాశిఖన్నా నటిస్తుందని సమాచారం. రాశి ఖన్నా చివరిసారిగా హిందీ చిత్రం యోధాలో నటించింది. ఆమె కొత్త చిత్రం అరణ్మనై 4, తెలుగులోకి బాక్ అనే పేరుతో డబ్ అయిన విషయం తెలిసిందే . ఈ చిత్రం ఏప్రిల్ 26, 2024న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, ఆమె తదుపరి తెలుగు చిత్రం గురించి ఓ వార్త నెట్టింట్లో హల్‌ చల్ చేస్తుంది.

టాలీవుడ్ హీరో నితిన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబిన్‌హుడ్‌  మూవీ లో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ పాత్ర గురించి  త్వరలోనే మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత నితిన్, రాశి ఖన్నాలు ఈ చిత్రం లో కలిసి నటిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles