తెలుసుకుని మాట్లాడు..లేకపోతే..!

Monday, September 16, 2024

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ అటు తమిళ్ ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ అలాగే పవన్ కల్యాణ్ సరసన ‘ఓజీ’ సినిమాలోనూ యాక్ట్ చేస్తుంది. మరోవైపు తమిళంలో జయం రవి సరసన ‘బ్రదర్’ సినిమాలో నటిస్తూ రెండు చేతులారా సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియాంక మోహన్ చేసిన వ్యాఖ్యలు తమిళ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాయి.

ఆ ఈవెంట్ లో ప్రియాంక మాట్లాడుతూ ” నాకు ఈ సినిమా స్పెషల్‌. దానయ్యగారు నాకు ఓజీ సినిమాలో కూడా అవకాశం కల్పించారు. నా కెరీర్ లో ఈ రెండూ చాలా ఇంపార్టెంట్, ఎస్.జె. సూర్య తో తమిళంలో డాన్ సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో నటించాను. ఒకవేశ మీరు కానీ ఖుషి 2 చేస్తే తమిళంలో కూడా పవన్ కళ్యాణ్ తో చేయండి అని” ఎస్.జె.సూర్యను అడిగింది. ఆ మాటలే విజయ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి.

పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ సినిమానుని తమిళంలో విజయ్ చేసిన ఖుషి నుండి రీమేక్ చేసిన విషయం తెలసిందే. అసలు ఖుషి -2 తీస్తే తమిళంలో విజయ్ తో తీయాలి కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ తో తీయమని ప్రియాంక కోరడం ఏంటి అని సోషల్ మీడియా లో కామెంట్లు పెడుతున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇదిలా ఉండగా ప్రియాంక నటించిన సరిపోదా శనివారం ఈ ఆగస్టు 29న విడుదలకు సిద్దంగా ఉంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలల వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles