సినిమాటోగ్రఫీ మంత్రులతో సినీ నిర్మాతల భేటి

Andhrawatch
1 Min Read

తెలుగు సినిమా రంగంలో ప్రస్తుతం కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో అనేక సినిమాల చిత్రీకరణలు ఆగిపోయాయి. ఈ పరిస్థితి నిర్మాతలకు ఇబ్బందులు కలిగిస్తోంది. సమస్యను పరిష్కరించేందుకు నిర్మాతల బృందం రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులను కలుసుకుంది.

తెలంగాణలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు జెమిని కిరణ్, ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, యార్లగడ్డ సుప్రియ, భోగవల్లి బాపినీడు కలిసి సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలను వివరించారు.

అదే విధంగా, ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి కందుల దుర్గేష్‌ను నిర్మాతలు బివిఎస్ఎన్ ప్రసాద్, డివివి దానయ్య, కెఎల్ నారాయణ, ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్, నాగవంశీ, యేర్నేని రవి శంకర్, టి.జి. విశ్వ ప్రసాద్, మైత్రీ మూవీస్‌కి చెందిన చెర్రి, యూవీ క్రియేషన్స్ వంశీ, వివేక్ కుచిబొట్ల, సాహు గారపాటి కలిసి కలుసుకున్నారు. సమ్మె కారణంగా ఏర్పడుతున్న సమస్యలను వారు వివరించారు.

దీనిపై కందుల దుర్గేష్, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో చర్చించి పరిష్కారానికి ప్రయత్నిస్తానని నిర్మాతలకు భరోసా ఇచ్చారు.

- Advertisement -
Share This Article