అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’ గురించి సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల రూపొందిస్తుండటంతోనే ప్రాజెక్ట్పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలు కూడా ఆ అంచనాలను మరింత పెంచాయి.
ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్పై ఉన్న నమ్మకం కారణంగా ప్రైమ్ ఈ హక్కులను సొంతం చేసుకుందని ఫిలింనగర్ టాక్.
ఈ ప్రాజెక్ట్లో అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడిగా గోపి సుందర్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు.
సినిమా రిలీజ్ డేట్, థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీ ప్రీమియర్ డేట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
