సంబరాల ఏటిగట్టు విడుదల తేదీ ఎప్పుడంటే..!

Friday, December 5, 2025

సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న తాజా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “సంబరాల ఏటి గట్టు” మీద సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ మొదట సెప్టెంబర్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పినా, తాజాగా ఆ ప్లాన్ మార్చబడింది. మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పెద్ద అప్‌డేట్‌ను అక్టోబర్ 15న ప్రకటించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఆ రోజే కొత్త రిలీజ్ డేట్ కూడా ఫైనల్ చేయబోతున్నారని సమాచారం.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా తెలుగు సహా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్‌తో పాటు జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవి కృష్ణ వంటి పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles