“విశ్వంభర” కోసం నాగశ్విన్ క్లారిటీ ఏంటంటే! టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్న భారీ చిత్రమే “విశ్వంభర”. మరి యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ విజువల్ ట్రీట్ కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమాకి విజువల్స్ చాలా కీలకమని తెలిసిందే. వీఎఫ్ఎక్స్ పరంగా చాలా పని ఉంది. అయితే టీజర్ వచ్చాక సినిమాని ఇంకా ఇంప్రూవ్ చెయ్యాలని కామెంట్స్ కూడా వినిపించాయి. దీంతో మేకర్స్ కి మళ్లీ పని పడింది. అయితే తాజాగా విశ్వంభర వీఎఫ్ఎక్స్ పనుల్లో కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగశ్విన్ భాగం అయ్యాడు అంటూ ఓ టాక్ ఇపుడు ఓ టాక్ నడుస్తుంది.
తను తన సినిమాకి వర్క్ చేసిన టీమ్ విశ్వంభర విజువల్స్ ఎఫెక్ట్స్ కోసం శ్రమిస్తున్నట్టు పుకార్లు వినపడుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదని సమాచారం. ఇపుడు నాగశ్విన్ కల్కి 2 పనుల్లోనే బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. అలాగే విశ్వంభర మేకర్స్ మరో టీంతో గ్రాఫిక్స్ పనులు చేయిస్తున్నారని తెలుస్తోంది. సో ఆ రూమర్స్ లో నిజం లేదని చెప్పొచ్చు.