ఓటీటీ ఎంట్రీ పై చిరు ఏమన్నారంటే..!

Thursday, December 4, 2025

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “విశ్వంభర” అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ని దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో వినోదాత్మక చిత్రాన్ని మొదలు పెట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చర్చకు వస్తోంది. అదే మెగాస్టార్‌ ఓటిటి ఎంట్రీ.

మన సీనియర్ స్టార్స్‌లో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి వాళ్లంతా ఓటిటి ప్రపంచంలోకి అడుగుపెట్టి, అక్కడ తమ సత్తా చూపించారు. ఎవరు హోస్ట్‌గా కనిపిస్తే, ఎవరు వెబ్ సిరీస్‌లో నటించి అలరించారు. కానీ చిరంజీవి మాత్రం ఇప్పటికీ ఓటిటి వేదికపై ఎంట్రీ ఇవ్వలేదు.

తప్పనిసరిగా చిరంజీవికి కూడా గతంలో ఓటిటి అవకాశాలు వచ్చాయి. ఒకప్పుడు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ కోసం ఆయనకు ప్రపోజల్ కూడా వెళ్లింది. కానీ ఆ సమయంలో చిరు ఆ ఆఫర్‌ని తిరస్కరించారు. ఎందుకంటే అప్పట్లో ఆయనకు ఓటిటి అనే ఫార్మాట్ పట్ల ఆసక్తి లేకపోవచ్చు లేదా స్క్రిప్ట్ నచ్చకపోవచ్చు.

ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ఇటీవల జరిగిన కుబేర సినిమా ఈవెంట్‌లో చిరంజీవి ఓటిటి మీద తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. తనకు సరైన కథ వస్తే, ఓటిటి కోసం నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇది మెగాఫ్యాన్స్‌కి మంచి అప్డేట్‌గానే చెప్పుకోవచ్చు.

ఇక ఈ వ్యాఖ్యలతో చిరంజీవి ఓటిటి ఎంట్రీ పై మళ్లీ చర్చ మొదలైంది. ఆయనలాంటి పెద్ద స్టార్ ఓటిటిలో కనిపిస్తే అది ఓ సంచలనం అవుతుంది. ఇప్పుడు అందరి చూపూ చిరు ఎప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇస్తారన్నదానిపైనే ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles