శబరిగా భయపెట్టేందుకు వస్తున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌!

Saturday, April 12, 2025

నటుడు శరత్‌ కుమార్‌ ముద్దుల కూతురు, తెలుగు ఇండస్ట్రీకి దొరికిన లేడీ విలన్‌ వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ …ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శబరి. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదల పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచిఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు వరుణ్‌ సందేశ్‌ హాజరై, ట్రైలర్‌ ను విడుదల చేశారు. చాలా కాలంగా వరలక్ష్మి హీరోయిన్‌ గా సక్సెస్‌ కాకపోయినా… సినిమాల్లోని ప్రధాన పాత్రలల్ఓ నటిస్తూ వస్తుంది. సర్కార్ వంటి పెద్ద సినిమాల్లో సూపర్ విలనిజం పండించింది.
ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ తమిళం నుంచి తెలుగు మీద ఫుల్‌ ఫోకస్‌ చేసి విజయం సాధించింది. యశోద, వీర సింహారెడ్డి,రీసెంట్ గా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అదే జోష్ లో ఇప్పుడు లీడ్ లో నటిస్తుంది. శబరి సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ జనాలను ఆకట్టుకుంటుంది.హీరో వరుణ్ సందేశ్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఆ ట్రైలర్ లోని సీన్స్ భయపెడుతున్నాయి.

సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తున్నాయి. వరలక్ష్మి పెర్ఫార్మన్స్ ఓ రేంజులో ఉంది. చచ్చిపోయిన వ్యక్తి బ్రతికి ఎలా వస్తుంది అనే డైలాగుతో ఈ ట్రైలర్ మొదలవుతుంది.. చివర్లో వరలక్ష్మి డ్యూయల్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం ఆసక్తిగా ఉన్నాయి. ఇక సినిమా ఏ విధంగా భయపెడుతుందో తెలియాలంటే మే 3 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమానికి నటుడు ఫణి, నటి సునయన , సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్, కాస్ట్యూమ్ డిజైనర్ మానస నున్న, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles