ఓటీటీలోకి సత్యం సుందరం!

Wednesday, October 23, 2024

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ అలాగే అరవింద స్వామి కాంబినేషన్ లో దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా చిత్రం “సత్యం సుందరం” కోసం తెలిసిందే. మరి తెలుగు సహా తమిళ్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓటిటి విడుదలకు సిద్దంగా ఉంది.

మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ అక్టోబర్ 27 నుంచి పాన్ ఇండియా భాషల్లో వస్తుంది అని ముందు తెలిపారు కానీ దానిని ఈ అక్టోబర్ 25 కి షిఫ్ట్ చేశారు. అయితే దీనితో పాటుగా ఓ ఇంట్రెస్టింగ్ మార్పుతో ఈ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా రన్ టైం థియేటర్స్ లో అయితే 2 గంటల 55 నిమిషాలకి పైనే ఉంది. కానీ దీనిని ఓటిటి వెర్షన్ లో మాత్రం 2 గంటల 38 నిమిషాలకి తగ్గించారు. సో థియేట్రికల్ వెర్షన్ అయితే ఇందులో రావడం లేదని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles