సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్న త్రిష!

Saturday, March 29, 2025

స్టార్ బ్యూటీ త్రిష వరుస సినిమాలతో ప్రస్తుతం ఫుల్‌ బిజీగా  ఉన్న సంగతి తెలిసిందే. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ త్రిష తన అభిమానులను తనవైపునకు తిప్పుకుంటుందనే విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే పలు క్రేజీ సినిమాల్లో నటిస్తున్న త్రిష, ఇప్పుడు ఒక్కసారిగా సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

దీనికి ఓ బలమైన కారణం కూడా ఉందని ఆమె చెప్పింది.తన పెంపుడు కుక్క జోర్రో మరణించిందని.. దాని మరణాన్ని తమ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నామని.. అందుకే, తాను కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా త్రిష ప్రకటించింది. ఈ వార్తతో త్రిష అభిమానులు కూడా విచారిస్తున్నారు.

అయితే, ఆమెకు తన పెంపుడు కుక్క అంటే ఎంత ప్రేమ ఉందో అని అనుకుంటున్నారు. ఇక తెలుగుతో పాటు తమిళ్‌లోనూ పలు క్రేజీ చిత్రాల్లో త్రిష హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’లో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles