నదివే అంటూ వచ్చేసిన నేషనల్‌ క్రష్‌!

Monday, December 8, 2025

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న తాజా ప్రాజెక్టుల్లో ఒకటి ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో, రష్మిక నుంచి మళ్లీ ఒక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఆశించే వీలుంది.

ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ కొద్దిరోజుల క్రితమే షేర్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ‘నదివే’ అనే టైటిల్‌తో ఒక మెలోడియస్ ఫీలింగ్ ఉన్న పాటను తొలిసింగిల్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సాంగ్‌ను జూలై 16న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ కథలో రష్మికకు జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తుండగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ చూస్తే ఈ సినిమా రష్మిక కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవొచ్చునన్న అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles