అందుకే చరణ్‌ తో చేయించా!

Tuesday, December 16, 2025

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఎప్పుడూ తన సినిమాల్లో భావోద్వేగాలకు ప్రత్యేక స్థానం ఇస్తారు. అలాంటి సందర్భాల్లో ఆయనకు ప్రభావం చూపిన అనుభవాలు కూడా ఉన్నాయి. రామ్‌చరణ్‌ హీరోగా నటించిన మగధీర సినిమాలో కనిపించే ఒక హృదయానికి దగ్గరైన సన్నివేశం వెనుక చిరంజీవి నటించిన కొదమసింహం కారణమని రాజమౌళి ఒకసారి చెప్పుకున్నారు.

ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ రాజమౌళి చెప్పింది ఏమిటంటే, ఆయన చిన్నప్పుడు థియేటర్‌లో కొదమసింహం సినిమా చూస్తున్నప్పుడు ఒక సీన్‌ బాగా గుండెల్లో పడింది. అందులో రౌడీలు చిరంజీవిని ఇసుకలో బలంగా పాతిపెట్టి వెళ్లిపోతారు. ఆ పరిస్థితిలో ఆయన ప్రాణాలను కాపాడేది గుర్రమే. గుర్రం ఆయనకు తాడు అందించి బయటికి తీయడం చూడగానే తాను చాలా ఎమోషనల్‌ అయ్యానని రాజమౌళి గుర్తు చేసుకున్నారు.

అయితే ఆ సన్నివేశం పూర్తిగా ముగిసిన తర్వాత తన మనసులో ఒక చిన్న లోటు అనిపించిందని ఆయన భావించారు. గుర్రం సహాయం చేసి ప్రాణాలు కాపాడినా, ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం చూపించకపోవడం తనకు అసంతృప్తి కలిగించిందట. ఆ సమయంలో గుర్రం ఒక జంతువు కాకుండా మనిషిలా అనిపించిందని, అలాంటి సహాయం చేసినప్పుడు ధన్యవాదం చెప్పే క్షణం ఉండాలి అని అనిపించిందని రాజమౌళి అన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles