టాలీవుడ్లో తెరకెక్కిన క్రేజీ సీక్వెల్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్తో దూసుకెళ్తోంది. కథతో సంబంధం లేకుండా ఈ సినిమాలోని కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా లభిస్తున్నాయి. ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్కు చేరుకుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణతో ఈ చిత్ర సక్సెస్ మీట్ను ఏప్రిల్ 4న ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. కాగా, ఈ సక్సెస్ మీట్ ఈవెంట్కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ అతిథిగా రానున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సక్సెస్ మీట్పై ఎన్టీఆర్ ఫ్యాన్స్లోనూ ఆసక్తి క్రియేట్ అవుతుంది.
‘మ్యాడ్ స్క్వేర్’ మూవీలో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ముఖ్య పాత్రల్లో నటించారు.