శ్రీవారి సేవలో సూపర్ స్టార్ ఫ్యామిలీ!

Tuesday, April 1, 2025

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఫ్యామిలీ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిర్కోదర్, కుమారుడు గౌతమ్, కూతురు సితార. గురువారం వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం మహేశ్ బాబు కుటంబ సభ్యులకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్దప్రసాదాలు అందజేశారు. మహేశ్ కుటుంబ సభ్యులతో కలసి మేఘా గ్రూప్ డైరెక్టర్ సుధా రెడ్డి కూడా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమలో నటించనున్నారనే సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles