వారిని పిచ్చిపిచ్చిగా వాడేస్తున్న సుజిత్‌!

Friday, December 5, 2025

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలపై మళ్లీ ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు. ఆయన నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు మరో భారీ సినిమా ఓజీని త్వరగా పూర్తిచేయాలనే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నప్పటికీ, ఆయన రాజకీయ బాధ్యతలు మధ్య మధ్యలో వస్తుండటంతో షెడ్యూల్ కాస్త కష్టంగా మారింది. దీంతో టైమ్ వేస్ట్ కాకుండా కొన్ని కీలక సన్నివేశాలను బాడీ డబుల్‌తో కూడా తెరకెక్కిస్తున్నారు. పవన్ సెట్లో ఉన్నప్పటికీ, ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో అనే అప్రమత్తతతో బాడీ డబుల్‌ను రెడీగా ఉంచుకుంటున్నారు. అర్జెంటుగా ఆయన షూటింగ్ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తే, ఆ సమయంలో షూట్ ఆగకుండా ముందుకు సాగించాలనే ఉద్దేశంతో చిత్ర బృందం ఈ ప్లాన్ చేశారట.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించనుండగా, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొనడం, పవన్ షెడ్యూల్ మేనేజ్‌మెంట్ విధానం ఇవన్నీ కూడా సినిమా చుట్టూ ప్రత్యేక ఆసక్తి కలిగిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles