డబుల్‌ పేమెంట్‌!

Tuesday, April 1, 2025

ప్రస్తుతం మన టాలీవుడ్ లో మంచి అవైటెడ్ గా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో యూత్ ఫుల్ క్రేజీ సీక్వెల్ చిత్రం మ్యాడ్ స్క్వేర్ కూడా ఒకరు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తమ మ్యాడ్ బాయ్స్ నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ల కలయికలో తెరకెక్కించిన మ్యాడ్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు అలా పెరుగుతూ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన టీజర్ తో కూడా సాలిడ్ హైప్ నెలకొనగా ఇపుడు మ్యాడ్ స్క్వేర్ విషయంలో సంగీత్ శోభన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

లాస్ట్ టైం నిర్మాత నాగవంశీ తమ మ్యాడ్ సినిమా చూసి ఎవరికి అయినా నవ్వు రాకపోతే పెట్టిన టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని చెప్పారని ఈసారి మ్యాడ్ స్క్వేర్ కి గాని నవ్వు రాకపోతే డబుల్ పేమెంట్ ఇస్తారు నాగవంశీ అన్న అంటూ ఈ సినిమా విషయంలో తాము ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనేది అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా ఈ మార్చ్ 29న గ్రాండ్ గా చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles