ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను జాగ్రత్త!

Friday, December 5, 2025

టాలీవుడ్‌ తో  పాటు  ఇతర దక్షిణాది భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన రీసెంట్‌ సినిమా “అమరన్” తో సెన్సేషనల్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.

మరి ఈ సినిమాతో పాటుగా తెలుగులో నాగ చైతన్యతో “తండేల్” అనే భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా సహా హిందీలో “రామాయణ” కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా విషయంలో తనపై వచ్చిన రూమర్స్ పై సాయి పల్లవి ఇపుడు తాజాగా ఫైర్ అయ్యింది. ఈ చిత్రం చేస్తున్న నేపథ్యంలో సాయి పల్లవి అసలు నాన్ వెజ్ తినడం లేదని ఆమె సినిమా పూర్తయ్యేవరకు తన లైఫ్ స్టైల్ ని మార్చుకుంది అంటూ పలు రూమర్స్ తమిళ సినీ వర్గాల్లో వ్యాప్తి చేస్తున్నారు.

దీంతో సాయి పల్లవి సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఎక్స్ ఖాతాతో ఇన్ని రోజులు ఇలాంటి వార్తలపై పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక నుంచి నాపై ఇలాంటి ఆధారాలు లేని వార్తలు ఏవైనా స్ప్రెడ్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఇదే కొనసాగితే మాత్రం లీగల్ గా వెళ్తా అని కూడా ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. దీంతో తన పోస్ట్ ఇపుడు వైరల్ అవుతుంది.

No tags for this post.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles