ప్రభాస్‌-పవన్‌ ట్రీట్‌!

Tuesday, December 9, 2025

పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తన సినిమాలతో థియేటర్లలోకి వస్తున్నాడు హరిహర వీరమల్లు సినిమాతో. ఈ చిత్రం పీరియాడిక్ డ్రామా తరహా మూవీగా తెరకెక్కుతుండగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా, జ్యోతి కృష్ణ కూడా ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. ఇప్పటికే మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మరొక ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇప్పుడు అభిమానుల్లో హీట్ పెంచుతోంది.

తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో వస్తున్న “ది రాజా సాబ్” మూవీ టీజర్‌ని హరిహర వీరమల్లు సినిమాతో థియేటర్లలో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా చూసేందుకు థియేటర్ కి వెళ్ళినవాళ్లు, అదేసమయంలో ప్రభాస్ మూవీ టీజర్‌ని కూడా స్క్రీన్ మీద చూడగలుగుతారు. ఇది మాత్రం రెండు హీరోల అభిమానులకు సూపర్ గిఫ్ట్ అన్న మాట.

ఇంకా ఈ క్రేజీ అప్డేట్ పై నిధి అగర్వాల్ కూడా సానుకూలంగా స్పందించినట్టు ఫిలిం సర్కిల్ లో చర్చ జరుగుతోంది. దాంతో ఈ కలయిక ఆడియోల్లో గట్టిగా కంఫర్మ్ అయినట్టే భావిస్తున్నారు. ఒకవైపు వీరమల్లు సినిమా జూన్ 12న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది. మరోవైపు రాజా సాబ్ టీజర్ కూడా అదే రోజు పబ్ లిక్ కి అందుబాటులోకి రానుంది. మొత్తానికి ఈ సారి థియేటర్ కి వెళ్ళేవాళ్లకు డబుల్ ట్రీట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles