తారక్‌ మూవీతో ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటుడు!

Friday, December 5, 2025

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సినిమా మీద అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ‘వార్ 2’ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ‘ఎన్టీఆర్–నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతుంది. యాక్షన్, థ్రిల్లర్ జోనర్‌లో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది.

ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ నటుడు టొవినో థామస్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తలు నిజమని పరోక్షంగా ధృవీకరించారు మరో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఆయన వెల్లడించిన విషయాల ప్రకారం– ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ చాలా బలమైన కథను సిద్ధం చేశారట. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు మరిన్ని ప్రధాన పాత్రలు కూడా ఉంటాయని చెప్పారు.

ఇవే కాకుండా, టొవినో థామస్‌తో పాటు బిజు మీనన్ అనే మరో మలయాళ నటుడు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని ఆయన తెలిపారు. అంటే ఇది పాన్ ఇండియా స్కేల్‌లో రూపొందుతున్న ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అన్నమాట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టొవినో థామస్ మాత్రం తన టాలీవుడ్ డెబ్యూ సినిమాగా ఎన్టీఆర్ సినిమాను ఎంచుకోవడం విశేషం. మరి ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles