కత్రినా కుంభ్‌ స్నానం పై నెటిజన్లు కామెంట్లు!

Friday, December 5, 2025

కత్రినా కుంభ్‌ స్నానం పై నెటిజన్లు కామెంట్లు! బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కొందరు ఫోటోగ్రాఫర్ల పై సీరియస్ అయ్యారు. మహా కుంభమేళాలో ఇటీవల కత్రినా కైఫ్ పవిత్ర స్నానం ఆచరిస్తుండగా పలువురు వీడియోలు, ఫొటోల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో కత్రినా కైఫ్ కి చాలా అసౌకర్యం కలిగింది. పైగా ఓ వ్యక్తి, కత్రినా కైఫ్ పక్కనే నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ జోక్స్ కూడా వేయడం జరిగింది. ఆమె గ్లామర్ పై కూడా అతను కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో, కత్రినా కైఫ్ అతను పై సీరియస్ అయింది. ఐతే, ఆ వ్యక్తి కత్రినా కైఫ్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘ఇక్కడ నేను, నా సోదరుడు, కత్రినా ఉన్నారు’ అని వెకిలిగా చెప్పారు. ఈ ఘటనపై మరో నటి రవీనా టాండన్ ఆ వ్యక్తి పై సీరియస్ అవుతూ మండిపడ్డారు. ‘ఇది చాలా అసహ్యంగా ఉంది. శాంతియుతంగా, ప్రశాంతంగా ఉండాల్సిన క్షణాలను ఇలాంటి వ్యక్తులు నాశనం చేస్తారు’ అని నటి రవీనా టాండన్ ఆ వ్యక్తి పై ఫైరయ్యారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles