నీల్‌ నే హీరోలా ఉన్నాడు!

Monday, September 16, 2024

ప్రభాస్‌ -ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో సలార్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.   ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది కూడా. ఇప్పుడు ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ఫౌజీ అనే పేరుతో ప్రచారం జరుగుతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యెర్నేని, ఎలమంచిలి రవిశంకర్ నిర్మించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కూడా హాజరయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వి సైతం ఈ కార్యక్రమానికి వచ్చారు.

అయితే ఈ కార్యక్రమంలోనే ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. అదేంటంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ కోసం ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన కూడా ఈ సినిమా ఓపెనింగ్ కి వచ్చాడు. ప్రశాంత్ నీల్ ని చూసి ప్రభాస్ వెంటనే ఈయనే ఒక హీరోలా ఉన్నాడు అంటూ కామెంట్ చేయగా వెంటనే నీల్ అలర్ట్ అయ్యి అప్పటి వరకు పెట్టుకున్న కళ్లద్దాలు తీసేసి ప్రభాస్ తో సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles