ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కి వచ్చేసిన కుబేర!

Sunday, January 11, 2026

టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు పొందిన శేఖర్ కమ్ముల ఇటీవల తెరకెక్కించిన చిత్రం “కుబేర” థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద అంచనాలను రేపింది.

రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో, కుబేర వసూళ్లు రూ.100 కోట్ల మార్క్‌ను దాటేయడం గమనార్హం. శేఖర్ కమ్ముల ప్రత్యేక మేకింగ్, నాగార్జున-ధనుష్ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా మారాయి.

ఇప్పుడీ సక్సెస్‌ఫుల్ మూవీ ఓటీటీలోకి చేరింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 18 నుంచి కుబేర స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా పలు భాషల్లో ఈ సినిమాను చూడొచ్చు. థియేటర్లలో మిస్ అయినవారికి ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles