ఆ డైరెక్టర్‌ తో కల్యాణ్‌ రామ్‌ మూవీ!

Thursday, December 11, 2025

నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్‌గా ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అయితే, ఈ సినిమా ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇక ఈ సినిమా రిజల్ట్ తర్వాత కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ క్రమంలోనే గిరీశయ్య అనే డైరక్టర్ కళ్యాణ్ రామ్‌కు ఓ కథను చెప్పినట్లు తెలుస్తోంది. కల్ట్ మూవీ అయిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ అనే పేరుతో రీమేక్ చేశాడు గిరీశయ్య. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమాను కూడా ఆయనే డైరెక్ట్ చేశాడు.

ఇప్పుడు కళ్యాణ్ రామ్ కోసం ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా కథను రెడీ చేశాడట. అయితే, కళ్యాణ్ రామ్ ఈ డైరెక్టర్‌ని హోల్డ్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ‘బింబిసార 2’ సినిమాను స్టార్ట్ చేయాలని కళ్యాణ్ రామ్ ఆలోచిస్తున్నాడట. కానీ, ఆ సినిమాకు కావాల్సిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని.. అందుకే గిరీశయ్యతో కళ్యాణ్ రామ్ సినిమా చేసే అవకాశం ఉందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినపడుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles