కోలీవుడ్‌ ని కూడా మెస్మరైజ్‌ చేస్తున్న జాన్వీ!

Thursday, September 19, 2024

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “దేవర”  గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటుండగా లేటెస్ట్ కోలీవుడ్ లో ప్రమోషన్స్ కి వెళ్లారు.

 అయితే తారక్ కి తెలుగు సహా చాలా భాషల్లో పట్టు ఉందన్న విషయం తెలిసిందే. అలాగే తమిళ్ లో కూడా ఎంతో అనర్గళంగా తాను మాట్లాడగలడు. అయితే నిన్న సర్ప్రైజింగ్ గా తమిళ్ లో ఎంతో అందంగా మాట్లాడుతూ జాన్వీ కపూర్ అందర్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచిందని తమిళ్ ఆడియెన్స్ అంటున్నారు.

జాన్వీ తమిళ్ లో ఎంతో చక్కగా మాట్లాడింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో కోలీవుడ్ ఆడియెన్స్ లో జాన్వీ కపూర్ కూడా మంచి అటెన్షన్ ని తెచ్చుకుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles