ఆమె మరణం విషయంలో జాన్వీ మండిపాటు!

Monday, December 8, 2025

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఓ సంఘటనపై స్పందిస్తూ వార్తల్లో నిలిచింది. ఇటీవల బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా ఆకస్మికంగా మృతి చెందింది. ఈ విషాద సమయంలో ఆమె అంత్యక్రియల వద్ద కొన్ని మీడియా ప్రతినిధులు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఈ నేపథ్యంలో హీరో వరుణ్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మీడియా వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. బాధాకర సంఘటనల సందర్భాల్లో అయినా మీడియా కొంత బాధ్యతతో ఉండాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచాడు. ఇలా విలేకరులు ప్రైవసీకి తలకిందులుగా ప్రవర్తించడం సరికాదని స్పష్టంగా చెప్పారు.

అయితే వరుణ్ అభిప్రాయానికి జాన్వీ కపూర్ తన మద్దతు ప్రకటించింది. చివరికి ఎవ్వరైనా ముందుకు వచ్చి మాట్లాడినందుకు తనకు ఆనందంగా ఉందని తెలిపింది. ఇలా ఆమె సోషల్ మీడియా ద్వారా వరుణ్ అభిప్రాయాన్ని సమర్థించడంతో ఆ పోస్ట్ మరింత వైరల్ అయింది.

ఇలాంటి ఘటనల్లో సెలెబ్రిటీల మద్దతు ఉండటం ద్వారా మీడియా ప్రవర్తనపై చర్చ జరగడం అవసరమన్న మాట వినిపిస్తోంది. జాన్వీ స్పందన ఇప్పుడు నెటిజన్లలో చర్చకు దారి తీసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles