భారీ ప్రమాదం..!

Monday, December 8, 2025

టాలీవుడ్‌లో యంగ్ హీరోగా పేరొచ్చిన నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందుతున్న “ది ఇండియన్ హౌస్” అనే సినిమా. ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ సముద్ర సన్నివేశం కోసం శంషాబాద్‌లో ఓ పెద్ద వాటర్ ట్యాంక్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కానీ ఈ సెటప్ సమయంలో ఓ అనుకోని ఘటన చోటు చేసుకుంది.

సీన్ చిత్రీకరణ సమయంలో ట్యాంక్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ఆ ప్రాంతంలో నీరు అంతా ఒక్కసారిగా వెళుతుండటంతో చుట్టుపక్కల హడావుడి నెలకొంది. ఆ సమయంలో అక్కడే ఉన్న అసిస్టెంట్ కెమెరామెన్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. అంతేకాకుండా మరో ఇద్దరు సభ్యులకు కూడా స్వల్ప గాయాలు అయినట్టు తెలిసింది.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి టీమ్ అందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సినిమా యూనిట్‌లో దిగులును కలిగించింది. ఇలాంటి భారీ సెట్లో ఇలా తట్టుకోలేని ప్రమాదం జరగడం అందరినీ కలచివేసింది. అయినా గాయపడినవాళ్లంతా త్వరగా కోలుకోవాలని సినీ ప్రపంచం మొత్తం కోరుకుంటోంది.

ప్రస్తుతం ఈ ఘటనపై యూనిట్ పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాపై ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ చూస్తే, కథా నిర్మాణం, టెక్నికల్ విలువల పరంగా కూడా ఇది ఎంతో విభిన్నంగా ఉండబోతోందని చెబుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles