ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చరణ్‌!

Wednesday, December 10, 2025

భారత ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభమవుతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ APL అక్టోబర్ 2, 2025న సాయంత్రం 7 గంటలకు న్యూ ఢిల్లీ, ఆనంద్ విహార్‌లోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఈ ఘనత కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరై లీగ్ ప్రారంభోత్సవాన్ని ప్రారంభిస్తారు.

APL భారతదేశంలో కొత్తగా ప్రవేశపెట్టే ఫ్రాంచైజీ ఆధారిత టోర్నమెంట్. ఈ లీగ్‌లో దేశంలోని ప్రముఖ ఆర్చర్లు మాత్రమే కాదు, అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు కూడా పోటీ ప‌డ‌నున్నారు. మొత్తం ఆరు జట్లు 36 మంది భారతీయ రికర్వ్ మరియు కాంపౌండ్ ఆర్చర్లతో, అలాగే 12 మంది టాప్ స్థాయి అంతర్జాతీయ ఆటగాళ్లతో కట్టబెడబోతున్నాయి.

ప్రపంచ ఆర్చరీ చరిత్రలో తొలిసారి రికర్వ్ మరియు కాంపౌండ్ ఆటగాళ్లు ఒకే జట్టులో కలిసి ఫ్లడ్‌లైట్స్ కింద పోటీ చేస్తారు. దీని ద్వారా ప్రేక్షకులకు మరింత ఉత్సాహభరితమైన, ఆకర్షణీయమైన వినోదాన్ని అందించడానికి ప్రయత్నించారు. అక్టోబర్ 2 నుండి 12 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌కు వరల్డ్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఆసియా మరియు భారత క్రీడా మంత్రిత్వ శాఖ మద్దతు అందించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles